Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed at Konapapapeta, Srirampuram Villages, U.Kothapalle Mandal on 15-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 2000 people and 500 Free Masks at Konapapapeta, Srirampuram Villages, U.Kothapalle Mandal on 15-Apr-2020.

15 ఏప్రిల్ 2020 బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం, కొనపాపపేట శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు 2000 మందికి పంపిణీ చేశారు. 500 మాస్కులు కూడా పంపిణీ చేశారు. శ్రీరామపురం, మల్లేవారితోట గ్రామాల ప్రజలకు కూడా సుమారు పది వేల మందికి కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలు పై అవగాహన కల్పించారు. అతిధి వై.ఎస్.అర్.సి.పి నాయకులు శ్రీ కారె శ్రీనివాసరావు గారు, ట్రస్ట్ కార్యకర్తలు శ్రీ పెనుమల్లు ఉషా కిరణ్ గారు, శ్రీ ఎం.సతీష్ గారు, శ్రీ పెనుమల్లు రామకృష్ణ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు పంపిణీ.
ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వ మత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని 548 సంవత్సరాల నుండి ప్రభోదిస్తున్న సుదీర్ఘ చరిత్ర గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి మానవ సేవయే మాధవ సేవ గా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకు ఇప్పటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో 13 లక్షల మందికి హోమియో మందులు పంపిణీ చేయటం జరిగింది అని అన్నారు. వేలాది గుడ్డ మాస్కులను, శానిటైజర్ లను కూడా పంపిణీ చేశామన్నారు. లక్షలాది మందికి కరోనా వైరస్ వ్యాధి పై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ సూచనలు అనగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, లాక్ డౌన్ ముగిసే వరకు ప్రతీ ఒక్కరూ ఇంటవద్దనే ఉండాలని తెలియచేస్తున్నామని శ్రీ పెనుమళ్లు రామకృష్ణారెడ్డి గారు అన్నారు. పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు, తెలంగాణా ముఖ్య మంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం గా పంపినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురశాల కన్నబాబు గార్కి అందచేసామన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.అర్.సి.పి నాయకులు శ్రీ కారే శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా ను, శ్రీ పెనుమల్లు రామ కృష్ణా రెడ్డి గారు పాల్గొన్నారు. ఈరోజున యు. కొత్తపల్లి మండలం శ్రీరామపురం, కొనపాపపేట, తదితర గ్రామాల్లో 2000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియో మందులు, 500 మాస్కులు పంపిణీ చేశారు. యు. కొత్తపల్లి మండలం లో అనేక గ్రామాలలో సుమారు 10,000 మందికి కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామని అన్నారు. కార్యక్రమంలో ఉషా కిరణ్ ఆధ్వర్యంలో ఉమర్ అలీషా యూత్ సభ్యులు శ్రీ యెన్.స్వామి గారు, శ్రీ ఎం.భాను గారు, శ్రీ ఎస్.సతీష్ గారు, శ్రీ ఎం.అశోక్ గారు, శ్రీ యెన్.నాని గారు, శ్రీ కె.శివ గారు, శ్రీ ఎం.శ్రీను గారు పాల్గొన్నారు.

01-Coronavirus-KonapapapetaVillage-UKothapalleMandal-15Apr2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015