Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Tadepalligudem, Prathipadu, Kothuru, L. Agraharam, Pulai Gudem, Kadiyadda, Telikicherla, Singarajupalem Villages on 01-April-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 5500 people at Tadepalligudem, Prathipadu, Kothuru, L. Agraharam, Pulai Gudem, Kadiyadda, Telikicherla, Singarajupalem Villages on 01-April-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులుపంపిణీ
ది.1/04/2020 బుధవారం
తాడేపల్లిగూడెం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాలమేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవసేవే మాధవసేవ అనె దృక్పథంతో కరోనా వైరస్ వ్యాధి నిరోధక ఉచిత హోమియో మందుల పంపిణీ వివిధ గ్రామాలలొ ఆయా గ్రామ కన్వీనర్లు ద్వారా పీఠము సభ్యులు శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు పంపిణి చేశారు. ఈ కరోనా వ్యాధి నిరోధానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు, రోంప ఉన్నవాళ్ళు మాస్క్ ధరించడం, మనిషికి మనిషికి ఓక మీటరు దూరం ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతిఒక్కరికి చెప్పడం జరిగింది.
తాడేపల్లిగూడెం లొ శ్రీ తంగిళ్ల వీరవెంకటభోగవసంతరాయుడు గారు మరియు వారి కుమారుడు శ్రీ తంగిళ్ల త్రిమూర్తులు వారి (తాడేపల్లిగూడెం ఆశ్రమశాఖ) ద్వారా 500 మందికి, ప్రత్తిపాడు లొ శ్రీమతి తాటిపర్తి రమాదేవి గారి ద్వారా 1000 మందికి, సింగరాజుపాలెం శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు గారి ద్వారా 1000 మందికి, కొత్తూరు శ్రీమతి తిరుమల్లా వరలక్ష్మీ గారి ద్వారా 500 మందికి, ఎల్. అగ్రహారం శ్రీమతి దారపురెడ్డి చంద్ర గారి ద్వారా 1000 మందికి, పుల్లాయిగూడెం శ్రీ కన్నూరి ముత్యాలమ్మ గారి ద్వారా 500 మందికి, కడియద్ద శ్రీమతి యాతం గంగభవాని గారి ద్వారా 500 మందికి, తెలికిచెర్ల శ్రీమతి వెంపల సత్యవతి గారి ద్వారా 500 మందికి ఇవ్వటం జరిగింది.
ఈ మాత్రలు ఒకరోజు మాత్రమే వేసుకోవాలి. వేసుకునే అరగంట ముందు మరియు అరగంట తరువాత ఏమి తినకూడదు, తాగకూడదు. పెద్దవాళ్ళు 4 మాత్రలు, చిన్న పిల్లలు 2 మాత్రలు వేసుకోవాలి.
ఈరోజు వివిధ గ్రామలైన తాడేపల్లిగూడెం, ప్రత్తిపాడు, కొత్తూరు, ఎల్. అగ్రహారం, పుల్లాయిగూడెం, కడియద్ద, తెలికిచెర్ల, సింగరాజుపాలెం లలో మొత్తం 5500 మందికి కరోనా వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేయడం జరిగినది.
ఇట్లు
గారపాటి గోపాలరావు(ఉపకాజాన అధికారి)
తాడేపల్లిగూడెం.

01-Coronavirus-TadepalligudemVillages-01April2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015