Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసినారు |05-05-2022

ప్రెస్ నోట్05-05-2022
మానవ సేవ యే మాధవ సేవ అని శ్రీమతి సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శ్రీమతి శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కాకినాడ నగర మేయర్ శ్రీమతి సుంకర శివ ప్రసన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమతి శివ ప్రసన్న మాట్లాడుతూ పీఠాధిపతి ఉమర్ ఆలీషా గారు మనుషులకు చలివెంద్రం ఏర్పాటు చేయుటయే కాక, పక్షులకు, పశువులకు కూడా చలి వెంద్రాలు ఏర్పాటు చేయుట అభినందనీయమని శ్లాఘించారు. ఆధ్యాత్మిక సేవతో పాటు, సామాజిక సేవ చేస్తున్న పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గార్ని మహోన్నతుడు అని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ, కాకినాడ ఆశ్రమ కమిటీ సభ్యులు శ్రీ పేరూరి బాబ్జీ, శ్రీమతి అన్నపూర్ణ, శ్రీ మరిసే నాగేశ్వర రావు మాస్టారు, శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి, శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి, శ్రీమతి కాకినాడ లక్ష్మి, శ్రీమతి వనుము మణి, శ్రీమతి అమటం సీతా వరలక్ష్మి, శ్రీమతి వుప్పల నూకరత్నం కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ శ్రీమతి శివ ప్రసన్న గారు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహానికి పుష్ప మాలాంకృతుల్ని చేశారు, అనంతరం జరిగిన విశ్వ ప్రార్థనలో పాల్గొన్నారు . హారతితో సభ ముగిసింది.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్.

Umar Alisha Rural Development Trust © 2015