Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at N.G.O Society, Tadepalligudem on 21-March-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 800 people at N.G.O Society, Tadepalligudem on 21-March-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులుపంపిణీ
ది.21-03-2020 శనివారం
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం యెన్.జి.ఓ సంఘము మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాలమేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ అవగాహన సదస్సు మరియు హోమియో వ్యాధి నిరోధక మందుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సదస్సులో అగ్రికల్చర్ శ్రీ ఏ.డి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ ఈ కరోన వ్యాధినిరోధక అవగాహన సదస్సు మరియు ఉచిత హోమియో మందుల పంపిణీ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వార అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పంచడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో యెన్.జి.ఓ సంఘము అధ్యక్షులు శ్రీ జి.శేఖర్ గారు మాట్లాడుతూ శ్రీ గోపాలరావు గారు గెజిటెడ్ ఆఫీసర్ అయినప్పటికీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయీనటువంటి మమల్ని ఎప్పుడు కూడా ఎంతో గౌరవంతో ప్రతి కార్యక్రమంలోను బాగ్యాస్వాములయేలా ప్రోత్సహిచడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా మంచి పని ముందుగానే వ్యాధి రాకుండా మందులు పంపిణీ చేయడం ఈ పీఠం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయం మరియు శ్రీ గోపాలరావు గారు పబ్లిక్ కి చాలా ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఈ మందులు అందరు వేసుకుని ముందుగా జాగ్రత పడాలి అని అన్నారు.
కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ ప్రతి వంద సంవత్సరాలకు ఏదో వక వ్యాధి వచ్చి ప్రపంచ దేశాల్ని వణికిస్తుంది. 1720లో ప్లేగు వ్యాధి, 1820లో కలరా వ్యాధి, 1920లో మేర్స వ్యాధి, ఇప్పుడు 2020లో కరోనా వ్యాధి వచ్చియున్నవి. ఈ కరోనా వ్యాధి నిరోధానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు, రోంప ఉన్నవాళ్ళు మాస్క్ ధరించడం, మనిషికి మనిషికి ఓక మీటరు దూరం ఉండాలని అన్నారు. ఈ మరియు మనవసేవే మాధవసేవ, ప్రార్ధించే పెదవుల కన్నా సాయంచేసే చేతులూమిన్న. కావున ప్రతివ్యక్తీ కూడ పదిమందికి సాయంచేయాలని, “నా మొక్క నా శ్వాస” అనే నినాదంతో 1000 మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం ద్వార పర్యావరణాన్ని పరిరక్షించాలి అని అన్నారు.ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వార అనేక కార్యక్రమలో పాల్గొనడం జరిగింది. అందరు మా గురువు గారు చూపిన బాట లో మన నడవడిక సాగాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యెన్.జి.ఓ సంఘము అధ్యక్షులు శ్రీ జి.శేఖర్ గారు,సెక్రెటరీ శ్రీ ప్రసాద్ గారు, పీఠం సభ్యులు శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, యెన్.జి.ఓ సంఘ నాయకులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగిని, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో 800 మందికి కరోనా వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేయడం జరిగినది.
ఇట్లు
తాడేపల్లిగూడెం యెన్.జి.ఓ సంఘము,
యెన్.జి.ఓ సెక్రటరీ యెన్.ప్రసాద్,
తాడేపల్లిగూడెం.

Coronavirus preventive medicine distributed by UARDT at N.G.O Society, Tadepalligudem on 21-March-2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015